వ్యాక్సిన్ అందరికి పూర్తి స్థాయిలో అందజేయాలి : రామచంద్రాపురం జనసేన నాయకులు పోలిశెట్టి చంద్ర శేఖర్

               రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో తోటపేట పంచాయితీ పరిధిలో ప్రజలకు 45 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ లో అతి తక్కువ మందికి వ్యాక్సిన్ లు వేయడం జరుగుతుందని రామచంద్రపురం జనసేన నాయకులు పోలిశెట్టి చంద్ర శేఖర్ గారు అన్నారు.  అదికారపార్టీ పార్టీ వారికి మాత్రమే ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కడ అధికారపార్టీ నాయకులను సంప్రదించి వారిని బ్రతిమాలికుంటేనే తప్ప వ్యాక్సిన్ వేయడం లేదని, మా జనసేన పార్టీ జనసైనికులు గుబ్బల శ్రీనివాస్ గారు మరియు కంచెర్ల వెంకటేశ్వరరావు గారు నాదృష్టికి తీసుకు రావడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ల వరకు మాత్రమే పార్టీల మద్య పోటీలుంటాయి. ఎలక్షన్ తరువాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం అందరిని సమానంగా చూడాలి. అందరినీ ఒకే దృష్టితో చూసి వ్యాక్సిన్ సరఫరా చేయాలని, అంతేకాకుండా తక్కువ మందికి వ్యాక్సిన్ అందచేయడం వలన పరిస్థితి మన అదుపులో ఉండదు కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ సరఫరా చేయాలని, వ్యాక్సిన్ సరఫరాలో ఎటువంటి స్వార్ధపూరిత రాజకీయాలు చేయరాదని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున హెచ్చరించడం జరుగుతుంది.

 

ఇవి కూడా చదవండి :

కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here