Logo
Date of Publish : 05 December 2021, 4:41 pm
Editor : Sake Naresh

నాణ్యమైన భోజనం అందించట్లేదని వార్డెన్ ను ప్రశ్నించిన ఉరవకొండ జనసేన నాయకులు

   ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఉరవకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వసతి గృహలను తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులు చెప్పినట్టుగానే భోజనంలో పురుగులు ఉన్నాయి. ఇలా కనీసం వారంలో మూడు నాలుగు రోజులపాటు భోజనంలో వస్తున్నాయని, వీటిని ఎలా తినాలి అని విద్యార్థులు వాపోయారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు వసతి గృహ నిర్వాహకులపై మండిపడుతూ నాణ్యమైన భోజనం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇటువంటి తప్పు మరొకసారి పునరావృతం కాకూడదని, ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మీ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రశేఖర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com