ఇసుక కొరత తీర్చాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని అధికారులకు వినతిపత్రం అందించిన ఉరవకొండ జనసేన నాయకులు

ఇసుక

          అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా జరుగుతోందని జనసేన నాయకులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో తహశీల్దార్ గారికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ  ప్రధాన మంత్రి ఆవాసయోజన జగనన్న కాలనీ పేరిట చాలామంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు మంజూరు అయినాయి. ఇప్పటికే చాలామంది ఆ స్థలాలలో ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ ఇనుక కొరత కారణంగా ఇంటి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇనుక రీచ్‌ లలో ఇసుక లభించుటలేదు, కానీ బ్లాక్‌ మార్కెట్లలో విచ్చలవిడిగా క్రయవిక్రయాలు గుట్టుచపుడు కాకుండా జరిగిపోతున్నాయి. దయచేసి మీరు ఈ అంశంపై దృష్టిసారించి బ్లాక్‌ మార్కెట్‌ దందాని నిలువరించి అధికారికంగా ఇసుక లభించే విధంగా పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయుటలో తగు తోడ్పాటును అందించాలని ఉరవకొండ జనసేన పార్టీ తరపున ఈ వినతి పత్రమును అందచేయుచున్నాము అని అన్నారు. ఇసుక రేటు పెరిగి సామాన్యులకు అధిక భారం అవుతుంది. దీని వలన గ్రామాలలో గృహ నిర్మాణం ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీలు ఇసుక మీద ఆధారపడి  అనేక మంది కార్మికులు ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు పెంచిన ఇసుక చార్జీలు తక్షణమే తగ్గించాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way