Logo
Date of Publish : 19 February 2022, 3:59 pm
Editor : Sake Naresh

త్రాగునీటి పైపులకు మరమ్మతులు చేయాలని RWS అధికారికి వినతిపత్రం ఇచ్చిన ఉరవకొండ జనసేన నాయకులు

    ఉరవకొండ, (జనస్వరం) : ఉరవకొండ పట్టణంతో పాటు ఐదు పరిసర గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీరు పైపుల లీకేజీ ఫలితంగా మురుగునీరు ఆ మంచినీటి పైపుల గుండా ప్రవహించి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నింబగల్లు సత్యసాయి తాగునీటి ట్యాంకుల ద్వారా ఉరవకొండ పట్టణంలోకి సరఫరా అవుతున్న మూడు నీటి పైపులు పగిలిపోవడం వలన రెండు రోజులుగా త్రాగునీరు వృథాగా పోతోంది. అలాగే మురుగునీరు ఆ పైపుల గుండా ప్రవహిస్తూ ఆ నీటిని తాగుతున్న ప్రజలు అస్వస్థతకి గురి అవుతున్నారు. ఈ త్రాగునీటి పైపులను వెంటనే త్వరితగతిన మరమ్మతులు చేయించి ప్రజారోగ్యం కాపాడవలసిందిగా RWS అధికారి గారికి ఉరవకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు బోయ చంద్రశేఖర్ గౌడ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు రాజేష్, అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు దేవేంద్ర, అజయ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com