ప్రభుత్వ పాలన పై సర్వత్రా నిరసన : నరసన్నపేట జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ జయరాం

     నరసన్నపేట, (జనస్వరం) : రాష్ట్రంలో నేడు కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా సర్వత్ర నిరసన వ్యక్తమవుతోందని దీనిని జనసేన పార్టీ మళ్లించేందుకు గాను సరైన అవకాశం లభించిందని నరసన్నపేట నియోజకవర్గ ఇంఛార్జ్ జయరాం తెలిపారు. బుధవారం నరసన్నపేట మండలంలోని మడపం గ్రామంలో జనసేన కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారని వివరించారు. ఇదే విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసిన అవసరం నేడు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవలసిన అవసరం ఉందని ఆయన ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగ సమస్యతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way