Logo
Date of Publish : 05 March 2022, 1:43 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ శిబిరాలకు అనూహ్యమైన స్పందన : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

● జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వనమోదు శిబిరాలకు ఊహించని స్పందన
● పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా సభ్యత్వ శిబిరాల నిర్వహణ
● కార్యకర్తల సంక్షేమమే జనసేన లక్ష్యం

     విజయనగరం, (జనస్వరం) :   జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) విజయనగరం కోట వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాలకు ప్రజలనుంచి అనూహ్యమైన, ఊహించని స్పందన లభిస్తుందని, జనసేన పార్టీ సిద్ధాంతాలను, అధినేత ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని, కార్యకర్తల సంక్షేమమే జనసేన లక్ష్యమని, భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చూడట్లేదని, కేవలం జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించి ఈ జీవితభీమా పధకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ అవకాశాన్ని ప్రతీ జనసైనికులు, వీరమహిళలు, జనసేన, మెగాఫ్యామిలీ అభిమానులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు శిబిరంలో జనసేన పార్టీ యువనాయకులు చెల్లూరి ముత్యాల నాయుడు, సారికి విశ్వనాధ్, డాక్టర్ మురళీమోహన్, లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, రాగోలు సాయి కిరణ్, వాసు, శ్రీను పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com