Logo
Date of Publish : 07 September 2023, 3:14 pm
Editor : Sake Naresh

భారీ వర్షానికి నేల కూలిన రెండు నివాస గృహాలు

     చింతపల్లి సెప్టెంబర్ 7 (జనస్వరం): అల్పపీడన ప్రభావంతో కుంభవృష్టిగా కురిసిన వర్షానికి రెండు నివాస గృహాలు నేల కూలి రెండు గిరిజన కుటుంబాలు నిరాశ్రయులైన సంఘటన కుడుముసారి పంచాయతీలో చోటు చేసుకుంది. నిరాశ్రయులైన గిరిజన కుటుంబాలు అందించిన వివరాలు ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభ వృష్టి వర్షానికి మండలంలోని మారుమూల పంచాయతీ అయిన కుడుము సారి పంచాయతీ పరిధిలోని మండిపల్లి, కోటగున్నల గ్రామాలకు చెందిన సాగిన సన్యాసమ్మ, పాంగి నారాయణమ్మ ల నివాస గృహాలు నేలమట్టం అయ్యాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాగ్రి తడిసి ముద్ద కావడంతో కనీసం వంట వండుకునేందుకు నిలువ నీడ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులమంతా రోడ్డున పడ్డామని వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com