Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ నాయకుల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృతి : ఖండించిన జనసేన నాయకులు

వైసీపీ

           పూతలపట్టు ( జనస్వరం ) : యాధమరి మండలంలోనీ తెళ్లరాలపల్లి గ్రామంలోనీ పాఠశాల ముందు నాడు నేడు పనుల కోసం తవ్విన గుంతలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు  మృతి చెందారు. పాటశాల ముందు నాడు నేడు పనులకోసం వై.సి.పి.నాయకులు తవ్వినగుంత గత ఒక సంవత్సరంగా ఇలానే ఉందని,ఈ విషయము మండల విద్యాశాఖ అధికారి, నిత్యం పాఠశాలకు వచ్చే ఉపాద్యాయులు, కూడా చూస్తూ ఉండిపోయారు అని జనాసేన పార్టీ మండల అధ్యక్షులు బి.కుమార్ ఖండించారు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ, మరియు వై.సి.పి.నాయకుల నిర్లక్ష్య వైఖరితో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని. దీనికి కారకులైన అధికారులు , వై.సిపి.నాయకులపై చర్యలు చేపట్టాలని, చిన్నారుల కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల జనసేన పార్టీ నాయకులు మృతిచెందిన చిన్నారులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన ప్రధాన కార్యదర్శి వేముల పవన్, సంయుక్త కార్యదర్శిఎస్.కార్తి, జనాసైనికులు వెంకటేష్, ప్రభాకర్, దిల్లిబాబు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way