Search
Close this search box.
Search
Close this search box.

అనంతసాగరంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు

అనంతసాగరం

          ఆత్మకూరు ( జనస్వరం ) : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నాయకులు మరియు అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహా బూబ్ మస్తాన్  ఆధ్వర్యంలో అనంత సాగరం బద్వేలు రోడ్డు కూడలి నందు గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంటరానితనం కుల వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న వివక్షను రానున్న తరాలు ఎదుర్కోకూడదని ఒక ఆశయంతో పరిస్థితులకు ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆ మహాపురుషుని స్మరిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చే స్తూ అందరికీ అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు అందే విధంగా అందాలి అనే నినాదాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తారని ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఎన్నో తరాలుగా మహనీయులు కులవివక్షను రూపు మార్చడానికి ఎంతో కృషి చేసిన ఇప్పటికీ మన మధ్యలో కులచిచ్చు రగిలిస్తూనే ఉన్నారు.. ఆర్థిక అసమానతలతో ప్రజలు తల్లడిల్లుతూనే ఉన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కులాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాల వారికి అందే విధంగా చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల కార్యదర్శి ఎం పెంచలయ్య, ప్రసాద్ తదితర జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way