Logo
Date of Publish : 31 March 2026, 8:38 am
Editor : Sake Naresh

కుక్కునూరు మండలంలో ఇసుక రాంపులకు గిరిజన సొసైటీలకు అనుమతి – కఠిన నిబంధనలు అమలు

కుక్కునూరు, మార్చి 30 (జనస్వరం) : కుక్కునూరు మండల పరిధిలోని దాచారం మరియు ఇబ్రహీంపేట ఇసుక రాంపులను మైనింగ్ శాఖ గిరిజన సొసైటీలకు నిర్వహణ కోసం అనుమతి ఇచ్చింది. ఈ రాంపుల నుండి తీసుకునే ఇసుకను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే తరలించాల్సి ఉంటుంది. ఇసుక రవాణా మరియు రాంపుల నిర్వహణకు ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రాంపుల పర్యవేక్షణతో పాటు, ఇసుకను తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలించకుండా నివారించేందుకు పోలీస్ మరియు రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పికెట్లు ఏర్పాటు చేశారు. మైనింగ్ శాఖ నిర్దేశించిన అన్ని నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ రాంపుల నిర్వహణ చేపట్టాలని అధికారులు సూచించారు. ఏ విధమైన ఉల్లంఘనలు జరిగిన పక్షంలో సంబంధిత గిరిజన సొసైటీలపై మరియు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com