తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానిక ఎంపీడీఓ కు వినతినిచ్చిన తొలుసూరుపల్లి గ్రామ జనసైనికులు
టెక్కలి పట్టణానికి అనుసంధానంగా ఉన్న తొలుసూరుపల్లి పంచాయతీ పరిధిలోని ధర్మనీలాపురం గ్రామ ప్రధాన రహదారి అత్యంత అధ్వాన్నంగా మారి దారుణంగా తయారైందని జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు అన్నారు. మంగళవారం ఈ రోడ్డు సమస్యపై స్థానిక ఎంపీడీఓ పి నారాయణ మూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ రోడ్డు వలన గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రహదారి పొడవునా గ్రామానికి చేరేంతవరకు ఈ మద్య కాలంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. రోడ్డు పూర్తిగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఈ రోడ్డు బారిన పడి ఆసులత్రుల పాలవుతున్నారని అన్నారు. టెక్కలి మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనున్న ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు కనుక అధికారులు తక్షణమే స్పందించి ధర్మనీలాపురం గ్రామానికి కనీసం రోడ్డు మరమ్మత్తులు చేపట్టగలరని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, సంజురెడ్డి, హనుమంతు దిలీప్, బొడ్డేపల్లి వెంకటేష్, తోట శ్యామ్ పాల్గొన్నారు.