తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

     తిరుపతి ( జనస్వరం ) : తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మొబైల్ ఫోన్ తీసుకుని పోలీసులు బెదిరించడంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మంగళవారం కిరణ రాయల్ వేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తన మొబైల్ ఫోన్ డాటాను మార్ఫింగ్ చేసి విడుదల చేస్తామని బెదిరిస్తున్నారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. మంత్రి రోజా, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే డాటా విడుదల చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని పిటీషన్‌లో తెలిపారు. పిటీషన్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని కింద కోర్టు గుర్తించిందని న్యాయవాది తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకుని హైకోర్టుల ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ సెక్రెటరీ, హోమ్ శాఖ సెక్రటరీ, డీజీపీ, నగరి ఇన్స్పెక్టర్, అప్పటి డీఎస్పీలకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టుల జనవరి 9కి వాయిదా వేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way