Search
Close this search box.
Search
Close this search box.

టిడ్కో ఇళ్ళు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి : జనసేన నాయకులు శివ రామకృష్ణ

    నూజివీడు, (జనస్వరం) : టిడ్కో ఇళ్ళు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలనీ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు. శివ రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం నూజీవీడు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కమీషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ 90% పూర్తి అయిన టిడ్కో ఇళ్ళు, మిగిలినవి కూడా పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. లబ్ధిదారులు అప్పులు తెచ్చి కట్టి ఈరోజు వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళు అద్దె ఇళ్లలో ఉంటే ప్రభుత్వం పట్చుకోవడం లేదు అన్నారు. ఇటు ప్రభుత్వం ఇచ్చే స్థలాలు రాక అట్టు టిడ్కో ఇళ్ళు రాక నానా ఇబందులకు లబ్ధిదారులు గురువుతున్నారు అని విన్నవించారు. దీని పైన స్పందించి డిసెంబర్ కల్లా టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులు అప్పగిస్తాము అని మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way