ప్రజాసేవే పరమావధిగా భావించి పలు సేవా కార్యక్రమాలు

ప్రజాసేవే

     విశాఖపట్నం ( జనస్వరం ) : ప్రజా సేవే పరమావధిగా భావించి పలు సేవా కార్యక్రమాలను వరుసగా నిర్వహిస్తున్నారు దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. పవనన్న ప్రజా బాట 97వ రోజు కార్యక్రమంలో భాగంగా 38 వార్డు శివాలయం వీధిలో వున్న పెళ్లి కూతురు ప్రవళికకు బంగారం తాళిబొట్టు, పట్టుచీర, జక్కెటు పసుపు కుంకుమ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానని చెప్పారు. సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో తను పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జనసేన నాయకులు వీర మహిళలు వీర సైనికులు తనకు అనువేధాలుగా సహకరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంల సిహెచ్ శ్రావణి, లుక్స్ గణేష్, త్రినాద, లక్ష్మణ్, రాజు, కుమారి, దుర్గ, కందుల కేదార్ నాధ్, కందుల బద్రీనాథ్, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way