Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల మీద నిఘా పెట్టి కక్ష కడుతున్న వైసీపీ ప్రభుత్వం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

            నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 292వ రోజున 46వ డివిజన్ వేమగుంట వారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు, అరాచకాలకు నిలయంగా మారిందన్నారు. ప్రజాదరణను రాష్ట్రాభివృద్ధిని చూపి పొందాల్సిన ప్రభుత్వం, నిత్యం ప్రజలను భయాందోళనలకు గురి చేసి అదుపులో పెట్టుకోవాలని చూస్తోందని అన్నారు. ఇంటికొక వైసీపీ వాలంటీరుని పెట్టి ప్రజల మీద నిఘా పెట్టి ఎవరైనా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని అన్నారు. గతేడాది జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన మంగళగిరి ఇప్పటం గ్రామస్తులను ఇప్పటికి కూడా వేధిస్తున్నారని, నేడు కూడా వారి ఇళ్ళను రోడ్డు వెడల్పు పేరుతో కూల్చే పన్నాగాలకు దిగారని అన్నారు. ఇప్పుడు జనసేన సభకు స్థలం ఇస్తున్న మచిలీపట్నం వాసులను బెదిరించే ప్రక్రియ ఇదని అన్నారు. ప్రజలపైనే కక్ష కడుతున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ యావత్తు ఇప్పటికే వణికిపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారంతా రాబోయేది పవనన్న ప్రభుత్వమే అనే విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way