Search
Close this search box.
Search
Close this search box.

TB వ్యాధితో కంటి చూపు కోల్పోయిన గట్టి సుబ్బారావుకి ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

       తాడేపల్లిగూడెం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తితో రత్నా పిల్లా (తెలంగాణ వీర మహిళా వైస్ చైర్ పర్సన్, టీం సైనిక గ్రూప్ అడ్మిన్ ), గట్టి శ్రీను దండగర్ర గ్రామ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో దండగర్ర గ్రామం (తాడేపల్లి గూడెం M.O , ప. గో. జిల్లా) సెరిబ్రల్ TB వ్యాధితో కంటి చూపు కోల్పోయిన గట్టి సుబ్బారావుకి చికిత్స నిమిత్తం జనసేనపార్టీ తరుపున 53,700/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయంలో ముఖ్యంగా దేశ రక్షణ తోబాటు సమాజ సేవకు కూడా మేము సైతం అంటూ దండగర్ర గ్రామ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందుకు వచ్చి RS 30,000/- లను, గట్టి శ్రీను, రత్నా పిల్లా ఆధ్వర్యంలో Rs 23,700/- లను మొత్తం Rs 53,700/- సంయుక్తంగా కలిసి అందజేసారు. దీనికి టీం సైనిక (మారిశెట్టి అజయ్ బాబు యువసేన), దండగర్ర JSP టీం, ఆరుగొలను JSP టీం, జన సైనికులు & వీర మహిళలు తమ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో JSP GLOBAL TEAM సభ్యురాలు కూడా అయిన రత్నా పిల్లాని, ఆమెతో బాటు పాల్గొన్న సభ్యులు అందరికీ బొలిశెట్టి శ్రీనివాస్, మారిశెట్టి అజయ్ బాబు, టీం సైనిక నుండి అమీర్ ఖాన్, JSP GLOBAL TEAM నుండి సురేష్ వరికూటి, పాపోలు అప్పారావు & సాయి కృష్ణ తేజ అభినందించారు. ఈ కార్యక్రమంలో రత్నా పిల్లా, గట్టి శ్రీనుతో బాటు జన సైనికులు మద్ది సోంబాబు, బందిల కృష్ణారావు, గట్టి శ్రీను, గిద్దా దుర్గారావు,మద్ది సోములు, మద్ది సాయి సుధీర్, గోకా నాగార్జున, యడ్లపల్లి నాగుబాబు, మద్ది సాయి సుమంత్, సురపరెడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way