Search
Close this search box.
Search
Close this search box.

అనాధ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జన సైనికులు

గుడివాడ

           గుడివాడ ( జనస్వరం ) ; కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ మందుపాడు కాలనీలో కట్ట అప్పారావు గారు వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులు కి తెలియజేయగా వెంటనే స్పందించి ఆ పెద్దాయనకు అన్నీ తామై కుల మతాలతీతంగా అంతక్రియలు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో నా అనే వాళ్ళు లేకపోయినా వాళ్ళకి అనాధ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్నామని అన్నారు. మనం పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా జన్మిస్తామో అదేవిధంగా చివరి దశలో కూడా చనిపోయినప్పుడు అంతే పవిత్రంగా అంతక్రియలు చేయాలని మా ఆలోచన అని మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాపమో పుణ్యమో మాకు తెలియదు ఇది భగవంతుని సేవ అనుకుంటూ చేస్తున్నామని దయచేసి అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. అలాగే ఎప్పుడు ఏ సహాయ కార్యక్రమాలు చేయాలన్న నాకు తోడుగా ఉంటున్న మా జన సైనికులకి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, అయ్యప్ప, సురేష్, చరణ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way