Search
Close this search box.
Search
Close this search box.

అనాధ వృద్ధ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

      గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక పోస్ట్ ఆఫీస్ రోడ్ లో గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ జీవనం గడుపుతున్న వృద్ధుడు మరణించడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయడంతో పట్టణ పోలీసు వారికి తెలియజేసి ఆ మృతదేహానికి అన్ని తమై మతాలు ఆతీతంగా అంతక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో ఇలాంటి కార్యక్రమలు చేస్తున్నామని పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మట్టిలో కలవక తప్పదు మనిషి జీవితంలో అసలైన కష్టం బాధ..! ఆస్తులు అంతస్తులు లేకపోవడం కాదు మనం ప్రాణ విడిచాక మోసే ఆ నలుగురు లేకపోవడం చాలా బాధాకరమని పిల్లలు లేనివారు డబ్బుల్లేక బంధాలకు దూరమైన వారు అనాధలు తుది శ్వాస విడిస్తే వారిని సాంప్రదాయ పద్ధతిలో అంతక్రియలు చేయడానికి నా ప్రాణం ఉన్నంతవరకు ఈ మహాత్రమైన కార్యక్రమం చేసుకుంటేనే ఉంటానని తెలియజేశారు.  అన్ని జన్మల్లోకి మానవజన్మ ఉత్తమమైనది ఎన్నో జన్మ పుణ్యఫలం ఉంటేనే మనం మనిషిగా జన్మిస్తాం అలాంటి ఉత్తమమైన జన్మని నలుగురు సాయం చేస్తూ మరణాంతరం కూడా జీవించ ఉండగలడమే జీవితానికి అసలైన అర్థం..! మనం చేసే పాప పుణ్యాలు ప్రతిదీ ఆ దైవం కంటపడుతూనే ఉంటుంది అది మరవకూడదు అని తెలియజేశారు.  ఈ కార్యక్రమానికి సహకరించిన గుడివాడ పట్టణ జనసేన నాయకులు షేక్ మీరా షరీఫ్, సాన నాని గారు, అయ్యప్ప, షేక్ కరీం,చరణ్,మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way