నెల్లూరు సిటీలో వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది

నెల్లూరు

       నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 308వ రోజున 9వ డివిజన్ నవాబుపేట FCI కాలనీలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా తయారైందో ప్రతిఒక్కరికి అర్థమైపోయిందన్నారు. నగరాన్ని ఏమాత్రం కనీస అభివృద్ధి కూడా చేయకుండా నిర్వీర్యం చేయడం వల్లే వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా నియోజకవర్గంలో ప్రజలందరూ గాజుగ్లాసు గుర్తుకి ఓటు వేసి తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, పవనన్న ప్రజాబాటకు వస్తున్న అపూర్వ స్పందనే అందుకు నిదర్శనం అని అన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, పవనన్న ప్రభుత్వంలో నెల్లూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way