Logo
Date of Publish : 28 January 2022, 2:42 am
Editor : Sake Naresh

శ్రీ కృష్ణదేవరాయల స్ఫూర్తితో పాలన కొనసాగించాలి : జనసేన రాష్ట్ర మహిళ సాధికారత చైర్మన్ జె. రేఖ

   ఎమ్మిగనూరు, (జనస్వరం) : శ్రీ కృష్ణదేవరాయలను స్ఫూర్తిగా తీసుకొని పాలన కొనసాగించాలని జనసేన రాష్ట్ర మహిళ సాధికారత చైర్మన్, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంఛార్జ్ జె. రేఖ అన్నారు. స్థానిక కర్నూలు నగరంలోని కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద ఆ మహానుభావునికి జనసేన జిల్లా పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జె.రేఖ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలంలో దక్షిణ భారతదేశమంతా ఏలాంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా పరిపాలన కొనసాగిందని, అలాంటి పరిపాలన కోసం నేటి రాజకీయ నాయకులు పాలకులు కృషి చేయాలని కోరారు. కృష్ణదేవరాయలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు వ్యవసాయానికి సాగునీటిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్, పూజల రాంభూపాల్ రెడ్డి, నాగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com