వర్షాకాలం వచ్చేసింది, బొబ్బిలి గ్రంథాలయం పైకప్పు కన్నాలైనా మూయించండి 

     బొబ్బిలి ( జనస్వరం ) : గ్రంథాలయం మరమ్మత్తులు మరియు మౌలిక సదుపాయాల గురించి జనసేన పార్టీ ప్రశ్నిస్తే, వారం రోజుల్లో పూర్తి చేసేస్తున్నామని చెప్పిన అధికార పార్టీ, నేటికి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతుందో తక్షణమే సమాధానం చెప్పాలని బాబు పాలూరి అన్నారు. నిధులు మంజూరయ్యి సుమారు రెండవ సంవత్సరం కూడా దాటిపోతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని, ప్రస్తుతం వర్షాల వలన గ్రంథాలయం పైకప్పు కున్న కన్నాల వలన గ్రంథాలయం మొత్తం తడచి ముద్దైపోతుందని వాపోయారు. కనీసం మహిళలకైనా టాయిలెట్ సదుపాయం లేదని, బోర్వెల్ కూడా పాడైందని, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు టేబుల్స్ కూడా లేవని అన్నారు. బుక్స్ కూడా అవసరమైనవి లేవని విద్యార్థులు ఇన్ని సార్లు మొత్తుకుంటున్నా ఎందుకు ప్రభుత్వంలో చలనం రావడంలేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారు ప్రశ్నించారు. తక్షణమే MLA శంబంగి చినప్పలనాయుడు గారు ఈ విషయంపై స్పందించి మరమ్మత్తులు జరిపించి కావలసిన కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way