మదనపల్లె, (జనస్వరం) : ప్రతి పేదవానికి సొంతింటి కల తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ళు మంజూరు చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఘనంగా జగనన్న కాలనీలు అంటూ కేవలం ఇళ్ళు కాదు ఊళ్లు నిర్మిస్తాం అని చెప్పిందని అనిత తెలిపారు. వాస్తవంలోకి వస్తే ఊరికి దూరంగా, చెరువుల పక్కన, స్మశానాలలో, కొండ గుట్టల్లో ఇళ్ళు మంజూరు చేయడంతో లబ్దిదారులు అయోమయంలో పడ్డారని వాపోయారు. అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి గ్రామ పరిధిలో చెరువుకు సమీపంలో, పుట్లూరు మండలంలో కొండగుట్టల్లో, ఉరవకొండ శివారులో స్మశానవాటికలో సుమారు 67,772 మందికి ఇళ్లు హడావిడిగా మంజూరు చేశారు. జగనన్న కాలనీలలో సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రెండేళ్లలో ఒక్క సదుపాయం కూడా కల్పించలేదు. చిత్తశుద్దితో ప్రజలకు మంచి చేయాలి గానీ ప్రచార ఆర్భాటం కోసం చేస్తే ఇలానే ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు మెరుగైన చోట ఇళ్ళు మంజూరు చేయాలని జనసేనపార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
