Logo
Date of Publish : 05 September 2023, 8:47 pm
Editor : Sake Naresh

జనసైనికులపై అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులు

   నెల్లూరు ( జనస్వరం ) : స్టేషన్ కు తరలించిన జన సైనికులకు తోడుగా ఉండి రాత్రి 1:30 గంటల వరకు విడుదలయ్యే వరకు కూడా తోడుగా ఉన్న లీగల్ జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చదలవాడ రాజేష్.  తిన్నింటి వాసాల లెక్కేసే వారు ఎవరంటే కావలిలో రామిరెడ్డి ప్రతాపరెడ్డి అంటారు. మా పార్టీ మద్దతు ద్వారా రాజకీయ నాయకునిగా ఎదిగిన మీకు మా నాయకుల విమర్శించే స్థాయి నీకు లేదు.. కావలిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే సర్వాంగ సుందరంగా కావలి మొదట్లో వచ్చే నీ ఇల్లు తప్పిస్తే మరేమీ లేదు. గునుకుల కిషోర్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి జనసైనికుల మనోభావాలు దెబ్బతీస్తూ సెంటర్లో ఏర్పాటుచేసిన తీయించాల్సిందిగా పలుమార్లు కమిషనర్ గారిని,పోలీసు శాఖను ఫిర్యాదు చేసినా కూడా స్పందన లేదు. దానిలో మీకు ఏ అభ్యంతరాలు ఉన్నాయి కావాలంటే మీరు కట్టుకోండి అని కమీషనర్ గారు తెలియజేశారు. ఈ విషయమై నిన్న సోమవారం రోజున ఉదయం నుంచి కమీషనర్ గారి కోసం మూడు గంటల దాకా వెయిట్ చేసిన జనసేన నాయకులు అదే ఫ్లెక్సీ వద్ద తమకు నచ్చిన ఫ్లెక్స్ ఏర్పాటు చేసి ఆందోళన చేశారు. అనంతరం ఫ్లెక్సీలు కావలి పట్టణ వీధుల్లో తిప్పారు. అనంతరం సెంటర్లో ఫ్లెక్స్ ముందు రోడ్డుపై బాటయించారు. జనసైనికులు అభ్యంతరం తెలియజేసిన వై సి పీ ఫ్లెక్స్ ను తీయకపోగా వారికి వ్యతిరేకంగా జనసైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ తీయాల్సిందిగా కావలి పోలీస్ వ్యవస్థ అంతా ముందుకు వచ్చింది. దాంతో మాకు సంబంధం లేదు. దీన్ని మాత్రమే తీస్తాం మీ అందరి మీద కేసులు పెడుతామని కావలి జనసేన నాయకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. సాయంత్రం దాకా దాదాపు 18 మందిని పోలీస్ స్టేషన్లో బంధించి నాన్ బెయిలబుల్ కేసులు పెడతామంటూ బెదిరించి,ఎట్టకేలకు సాయంత్రం నిరసనలు చేసిన వారిని వదిలేసి ఉదయం కమిషనర్ ఆఫీస్ దగ్గర ఎవరైతే ఆందోళన చేశారో వారిని మాత్రమే బెలబుల్ కేసులు పెట్టారు. వారికో చట్టం వీరికో చట్టం అనే విధంగా తయారయింది వైసిపి ప్రభుత్వం.జనసేన పార్టీ నెల్లూరు జిల్లా లీగల్ ఇన్చార్జి చదలవాడే రాజేష్ గారి జనసేనకులపై అక్రమ కేసులు ఏ విధంగా పెడతారు ఏ సెక్షన్లో కింద మీరు కేసు కట్టారో తెలియజేయాలి.ఫ్లెక్సీ కడితే బెయిలబుల్ కేసులుగా ఎలా మారుస్తారని అన్నారూ. పోలీసు పోలీసు వ్యవస్థతో గట్టిగా నిలబడ్డారు,చేసేదేమీ లేక బైలబుల్ కేసులతో పోలీసులు వ్యవస్థ సరిపెట్టుకున్నారు. ఇవంతా కూడా వైసీపీ నాయకుల ఒత్తిడిలతోనే జరుగుతుంది మనోభావాలు ఎవరికైనా ఒకటే అని వైసిపి నాయకులు ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు తమ గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకోవాలి. ఈ విషయంలో కావలి పట్టణంలో గట్టిగా నిలబడిన జనసేన నాయకులను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము.  జనసైనికులు ఏమాత్రం అపాయమున్న లీగల్ సెల్ తోడుగా తోడుగా నిలబడి వారి సమస్యలు పరిష్కారం వరకు కూడా ముందుంటారు తెలియజేసిన లీగల్ సెల్ ఇన్ చార్జీ చదలవాడ రాజేష్ గారు అభినందనీయులు. ఈ కార్యక్రమంలో జనసేన కావలి నియోజకవర్గం ఇంచార్జ్ సుధాకర్, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆత్మకూరు ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్ కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి, అధికార ప్రతినిధి ఋషి, కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సుధీర్, చంటి తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com