Search
Close this search box.
Search
Close this search box.

వాపు ను చూసి బలుపు అనుకుంటున్న టీడీపీకి ప్రజలే బుద్ది చెబుతారు : రేగిడి లక్ష్మణరావు

రేగిడి లక్ష్మణరావు

      విజయనగరం ( జనస్వరం ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టకపోవడంతో టీడీపీ గెలిచిందని టిడిపి నాయకులు గంట శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగిందని అన్నారు. అలాంటప్పుడు టీడీపీ నాయకులు కునా రవికుమార్ ఏ విధంగా జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడుతారని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని జనసేన పార్టీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శి రేగడి లక్ష్మణరావు ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ మీరు మాకు సీట్లు ఇవ్వడం ఏంటి? మేమే మీకు సీట్లు ఇస్తాం 20, 30 ఈసారి కచ్చితంగా జనసేన పార్టీ 2024 అధికారంలోకి వస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలనే ద్యేయంగా జనసేన పార్టీ కార్యకర్తలు, మహిళలు పని చేస్తున్నారు. టిడిపితో మాకు పొత్తు అవసరం లేదు, మీరాడే మైండ్ గేమ్ పవన్ కళ్యాణ్ గారికి మొత్తం తెలుసు. ఒక్కసారి వారాహితో రోడ్డు మీదకు వస్తే ఎవరు బలము ఏంటో తెలుస్తుందన్నారు. ఆరు శాతం నుండి 30% కి పెరిగిన జనసేన పార్టీ బలం. మాకు ఎవరు దయ దక్షిణాల అవసరం లేదు. టిడిపి తో పొత్తు కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. టిడిపి అవసరం మాకు లేదని మా అవసరం టిడిపికి మాత్రం ఉందని గ్రహించుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి కునా రవికుమార్ తప్పుడు మాటలు మాట్లాడితే రాజకీయ జీవితం లేకుండా చేస్తామని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way