సీతానగరం నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించిన జనసైనికులు
సీతానగరం నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈ రోజు పార్వతీపురం సబ్ కలెక్టర్ గారిని మరియు ఆర్&బి అధికారులను కలిసి జనసేన పార్టీ మండల నాయకులు మరియు నియోజకవర్గం నాయకులు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. 1936లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన బ్రిడ్జిని ఈ ప్రభుత్వాలు మరమ్మత్తులు చేసుకుంటూ వస్తుంది, ఎన్ని సార్లు మరమ్మత్తులు చేసినా ఫలితం శూన్యం. ఇక్కడ మరమ్మత్తుల పేరుతో అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు. కానీ ప్రజలకు మంచి జరగడం లేదు. వెంటనే నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అలాగే ఎప్పటినుండి బ్రిడ్జి పనులు మొదలు పెడతారో ఒక స్పష్టత ఇవ్వాలని మొన్న మరమ్మత్తులకు కేటాయించిన నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయని లెక్కలు చెప్పాలని జనసేన పార్టీ మండల నాయకులు శివశంకర్ పోతల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.