కొత్తపేట నియోజక వర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యములో జనసేన పార్టీలోకి చేరిన వానపల్లి గ్రామ ప్రజలు

కొత్తపేట

        కొత్తపేట, (జనస్వరం) :  అధికారం లేకపోయినా, జనసేనాని ఆశయాలు నచ్చి, జనసేన పార్టీకి అండగా నిలిచి, ఆత్మీయతను పంచిన వానపల్లి గ్రామ పెద్దలకు, యువకులకు ప్రత్యేక అభినందనలు తెలిపినా కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు.  తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, ప్రముఖ నాయకులు, జనసేన ఇంఛార్జ్  బండారు శ్రీనివాస్  గారు మాట్లాడుతూ, కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ, ఎంతో బలోపేతం అయిందని, రాష్ట్రములో  జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ గారి  ఆశయాలు, ఆలోచనలు, దయాగుణం మానవత్వం కలిగిన మనసున్న మారాజుగా, ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారని, ఓటమి గెలుపు ఎలాంటి వ్యక్తికైనా ఉంటాయని, ఓడినా, గెలిచినా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే గొప్ప నాయకుడు, జనసేన అధినేత అని, మచ్చలేని నాయకుడుగా, అవినీతి మరక లేని నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు.జనసేన పార్టీలోకి  చేరడానికి ముందుకు వచ్చిన, వానపల్లి గ్రామ పెద్దలకు,యువకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఆయన అన్నారు. జనసేన పార్టీకి వానపల్లి గ్రామం నుంచి సేవలందించడానికి, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఓసి సోదరులు అధిక సంఖ్యలో రావడం ఎంతో శుభ పరిణామమని, మీ అందరి అభిమానం వెలకట్టలేనిది, జనసేన పార్టీ అందరి పార్టీ అని, జనసేనాని అందరి వాడు అని, జనసేన పార్టీ ప్రతి ఒక్కరిని ఆదరించే పార్టీ అని, ప్రతి ఒక్కరి సేవలను తప్పక గుర్తు పెట్టుకుంటామని, ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్  గారు తెలియజేశారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, వానపల్లి గ్రామ ప్రజలు తదితురులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way