Search
Close this search box.
Search
Close this search box.

అనాధ వృద్ధ తల్లి మృతదేహానికి అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

       గుడివాడ ( జనస్వరం ) :  గుడివాడ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ రోడ్ లో గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఒక వృద్ధతల్లి రాత్రి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయగా పోలీస్ వారికి సమాచారం తెలియజేసి ఆ వృద్ధ తల్లి అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో నా అనే వాళ్లు లేక అనాథులుగా చనిపోవడంతో ఆ మృతదేహాలకు అన్ని మేమే అంత్యక్రియలు చేస్తున్నామని, అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం నాడు ఒక వృద్ధతల్లిని అనాదిగా అంతక్రియలు చేయడం చాలా బాధాకర విషయం అని అన్నారు. ఆ తల్లి ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో తెలియదు కానీ మేము ఆ తల్లికి ఒక కొడుకు లాగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, మనం పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా పుడతామో అదే చివరి దశలో తనువు చాలించినప్పుడు అదే పవిత్రంగా ఉండాలని ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నాకు తోడుగా ఉంటున్న నా టీం సభ్యులకు మరియు పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, చరణ్, సురేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way