తిరుపతి, డిసెంబర్ 27 : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శనివారం ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు. విద్య, సేవారంగంలో విశేష సేవలందిస్తున్న విశ్వం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి కి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసా పత్రం, మొమెంటోను అందచేసి ప్రత్యేకంగా అభినందించారు.