జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో గ్రేటర్ ఎన్నికల సిద్ధానికి సమావేశం అయిన జనసైనికులు
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ విధివిధానాలపై, డివిజన్ లోని ప్రజా సమస్యలపై బలమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని, అదేవిధంగా అభిమానులను కార్యకర్తలుగా, ఓటర్లుగా మార్చుకుని సామాన్యుడి వెనక జనసేన ఉంది అనేలా అధికార పార్టీ తప్పులను బట్టబయలు చేసేలా నిర్భయంగా ప్రశ్నించాలని సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ నందగిరి సతీష్ కుమార్, డివిజన్ అధ్యక్షులు జీవన్, ప్రధాన కార్యదర్శి రమేష్,కమిటీ సభ్యులు రవి, శివ, విజయ్, దుర్గాప్రసాద్, రఘువంశీ, సంపత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.