
గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం, నాయకులు మర్రాపు సురేష్ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి కార్యాలయంలో గజపతినగరం నియోజకవర్గ కెంగువ గ్రామంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించారు. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన రావు, లాలిశెట్టి రవితేజ, రవికుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పెనుమజ్జి ఆదినారాయణ, చింత నారాయణరావు పాల్గొన్నారు.