రహదారులు మరమ్మత్తులు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

రహదారులు

        నూజివీడు ( జనస్వరం ) : నూజివీడు నుండి ధర్మాజిగూడెం అర్&బి ప్రధాన రహదారిలో లీలానగర్ నుండి వలసపల్లి రహదారి మరమ్మత్తులు చేయాలని జనసేన నాయకులు కోరారు. లీలనగర్ అడ్డరోడ్డు వద్ద రోడ్డు మీద మార్జిన్ ల వద్ద పడిన గండి పడిన రోడ్డును బాగు చేసి, దిగవల్లి రోడ్డులో వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రమాదాలను అరికట్టాలని నూజివీడు సబ్ కలెక్టర్ గారికి అర్జీ అందచేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు. నూజివీడు నుండి వలసపల్లి వెళ్ళే ప్రధాన అర్ అండ్ బి రోడ్డు మర్మత్తులు , లీలానగర్ అడ్డ రోడ్డు వద్ద రోడ్డు ఇరు వైపుల లోతైన గండి పడి ప్రమాదకరంగా మారడంతో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అలానే అదే రోడ్డులో దిగవల్లి వద్ద వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు సబ్ కలెక్టర్ గారికి తెలుపుతూ స్పందనలో అర్జీ అందచేశారు. ఇ కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు తోట వెంకట్రావు, సురిశెట్టి శివ,ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, గాంధీ, సాయి చరణ్, సతీష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way