Search
Close this search box.
Search
Close this search box.

బొంతువారి పాలెంలో స్మశాన వాటికలో స్నాన ఘట్టాలను, ప్రహారీ గోడను నిర్మించిన జనసేన నాయకులు

జనసేన

     తణుకు ( జనస్వరం ) : తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం బొంతు వారి పాలెం మధ్య వీధిలో నివసిస్తున్న వారికి స్మశాన వాటికలో స్నానానికి నీటి కుళాయిలు లేనందున బొంతువారి పాలెం మధ్య వీధి రామాలయ సంఘం సభ్యుల కోరిక మేరకు అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ గారి ఆర్థిక సహాయంతో స్నానానికి నీటి కుళాయిలు మరియు రామాలయం చుట్టూ మరియు రావి చెట్టు చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీటి కొళాయిలను తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొంతువారి పాలెం మధ్య వీధి రామాలయం సంఘ సభ్యులు విడివాడ రామచంద్ర రావు దాసం ప్రసాద్ గారిని MPTC మరియు 18 వ వార్డు మెంబర్ని ను దిరిశాల వెంకట్ ని శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ సెక్రటరీ దిరిశాల వెంకట్, MPTC బుద్దాల రాంబాబు, 18 వ వార్డు నెంబర్ ఈడూరు రాంబాబు, కట్ట అప్పలపల్లి మరియు అత్తిలి మండలం తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way