Search
Close this search box.
Search
Close this search box.

ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలోనే జనసేన నాయకుడు రాజారెడ్డిపై దాడి

ఎమ్మెల్యే కేతిరెడ్డి

       ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా నిన్నటి రోజు జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి పై వైసీపీ గుండాలు చేసిన దాడి గురించి మాట్లాడుతూ ఈ దాడి ఖచ్చితంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని కేతిరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. జనసేన పార్టీ తరపున పట్టుచీర వ్యాపారస్తులకు మద్దతు తెలియజేయడమే రాజారెడ్డి చేసిన తప్ప అంటూ అలాగే జగన్ రెడ్డి మీ ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేసినా జనసేన పార్టీ ఎదుర్కొంటుందంటూ డీజీపీ మా బంధువేనని కేతిరెడ్డి చెప్పుకుంటూ ధర్మవరంలో అరాచకాలు చేస్తున్నాడని అన్నారు. అతని అరాచకాలను వెంటనే అడ్డుకోవాలని ఇలాంటి ఎన్ని క్రిమినల్ ముఠాలను తయారుచేసిన జనసేన పార్టీ భయపడదని అన్నారు. నీ అరాచకాలను అడ్డుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిలదీస్తామని అలాగే రాజారెడ్డి పైన జరిగిన దాడిలో పోలీస్ పాత్ర ఉందని ఎస్పీ విచారణ జరిపించి ధర్మవరంలో ఐపీఎస్ అధికారులను నియమించాలని డిజిపిని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way