Search
Close this search box.
Search
Close this search box.

28వ డివిజన్లో ముగిసిన జనచైతన్య యాత్ర

   ఒంగోలు ( జనస్వరం ) : ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచన మేరకు డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 58వ రోజు ఒంగోలులోని 28వ డివిజన్ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఐదు రోజులు 28వ డివిజన్ లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి పలు సమస్యలను గుర్తించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య,సరైన డ్రైనేజీ వ్యవస్థ లేవకపోవడం,ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, అకారణంగా పెన్షన్లు తొలగించడం వంటివి, ఉపాధి దొరకటం లేదని మా దృష్టికి వచ్చాయని తెలిపారు. వీటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకుని పోయి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని జనసేన నాయకులు స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అలానే అనంతరం డివిజన్లో విజయవంతంగా పర్యటన పూర్తి చేసినందుకు గాను జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, పోకల హనుమంతురావు, వీర మహిళ మాదాసు సాయి నాయడు మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, పఠాన్ కాలేషా, తీగల రాము తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way