తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులని విన్నవించిన ఇచ్చాపురం జనసైనికులు
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మండలంలో కేదారిపురం నుండి ముచంద్ర రహదారి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందని గ్రహించిన జనసేన నాయకుడు తిప్పన దుర్యోధన రెడ్డి గారు సమస్యను ఇచ్ఛాపురం జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యని ఇచ్చాపురం జన సేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు గారు ఈరోజు M.P.D.O గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దానికి M.P.D.O గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యనే ఆర్ అండ్ బి దృష్టికి తీసుకొని వెళ్లి వీలైనంత తక్కువ సమయంలోనే సమస్య పరిష్కారం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన నాయకులు దాసరి రాజు గారు, దుర్యోధన రెడ్డి గారు ,శంకర్ రెడ్డి గారు బిజెపి నాయకులు రమేష్ గారు సంతోష్ గారు ,జన సైనికులు అఖిరా సాయి, రవి రెడ్డి మరియు ముచంద్ర కేదారిపురం బెన్నుగాపేట గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.