Search
Close this search box.
Search
Close this search box.

ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం, భావితరాల భవిష్యత్తే జనసేన లక్ష్యం

జనసేన

        పామిడి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమేనని, జనసేన నాయకుడు తీసుకునే ఎటువంటి నిర్ణయానైనా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు కచ్చితంగా స్వాగతిస్తారని పామిడి మండల అధ్యక్షులు యం.ధనుంజయ అన్నారు. ఆయన ఆశయాల కోసం తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపు కోసం బలంగా పోరాడుతాం ధైర్యంగా ముందుకెళ్తామని, రాష్ట్రంలో రౌడీయిజం, గుండాయిజం, పెరుగుతోందని ప్రశ్నించిన వారిపై దాడులు, బెదిరింపులు, పోలీసులతో అరెస్టులు చేయిస్తూ జగన్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో వైసిపి ప్రభుత్వాన్ని గద్దేదించేందుకు ఖచ్చితంగా బిజెపి, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతిపక్షాల ఐక్యతతో మాత్రమే సాధ్యమని ధనుంజయ పేర్కొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way