కుమిలి, అక్టోబర్ 19, (జనస్వరం) : కుమిలి గ్రామం, పూసపాటిరేగ మండలంలో నిర్వహించిన “పొలం పిలుస్తోంది” కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. ఆమె పంటల పరిస్థితి, నీటి వనరులు, ప్రకృతి ఆధారిత వ్యవసాయం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వ్యవసాయాన్ని లాభదాయక దిశగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను రైతులకు వివరించారు. రైతు సంక్షేమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మాధవి, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిచేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు.