Search
Close this search box.
Search
Close this search box.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం – శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

    అమరావతి, (జనస్వరం) : రాజకీయాల్లో మనందరం గౌరవించాల్సింది ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైసీపీ పాలన సాగుతోంది. అధికారంలో ఉన్నాం ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో బుద్ధి చెబుతారు. వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా మళ్లీ అధికారంలోకి రాదు. ఫలితాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండేది ఖాయం. 

 మీ అహంకారానికి అదే నిదర్శనం  

కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడింది చూశాను. ఆయన మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత అహంకారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదు. ఆయన పెద్దఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు  శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా అనవసరంగా ఇలాంటి సమస్యలే సృష్టించారు. మా నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదు. మీరు ఒక శాసనసభ్యుడిగా సమయం వృధా చేసుకోకుండా… కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలపై మాట్లాడండి. డంపింగ్ యార్డుల్లా మారిన మత్స్యకార గ్రామాల గురించి మాట్లాడండి. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై మాట్లాడండి. బలవంతంగా చెత్త పన్ను వసూలు చేయడానికి బ్యానర్లు కట్టుకొని తిరిగారే…. అదే మీ అహంకారానికి నిదర్శనం.   

శశిధర్ చేతిలో ద్వారంపూడి ఓటమి తప్పదు 

ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీకి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలే బుద్ధి చెబుతారు. దయచేసి ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని, కాకినాడ అభివృద్ధికి సమయం కేటాయిస్తే ప్రజలు కొంతవరకైనా హర్షిస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే పరిస్థితే లేదు. ఆయనపై ముత్తా శశిథర్ గారు ఘన విజయం సాధించి తీరుతారు. మా నాయకులు ఇప్పటికే ఆ ప్రాంతంలో బలంగా పనిచేస్తున్నారు. గతంలో మా వీర మహిళలను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాయపరిచారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్లే ఇంటింటికి వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way