Logo
Date of Publish : 12 March 2024, 9:51 pm
Editor : Sake Naresh

వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది

      గుంటూరు ( జనస్వరం ) : రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికేలా ఈ నెల 17 వ తేదీన చిలకలూరిపేట సభ జరగనుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. దేశ ప్రధాని మోదీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేనాని పవన్ కల్యాణ్ లు పాల్గొనే చారిత్రక సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీలతోనే రాష్ట్రానికి స్వర్ణయుగం సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో జరిగిన పాలనా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ణించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎప్పుడైతే మూడు పార్టీల పొత్తు కుదిరిందో అప్పుడే వైవీపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. సభ అనంతరం వైసీపీ నేతలు అస్త్ర సన్యాసం చేయనున్నారని జోస్యం చెప్పారు. మోదీ , చంద్రబాబు , పవన్ ల నాయకత్వంలోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాకారం కానుందన్నారు. వచ్చే ఆదివారం జరగనున్న సభకు టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీ శ్రేణులతో పాటూ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని ఆళ్ళ హరి కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com