అనంతరాజుపేటలో జనసేన నుండి వైసీపీలో చేరికలు ప్రచారం అవాస్తవం

అనంతరాజుపేట

         రాజంపేట ( జనస్వరం ) : అనంతరాజుపేట గ్రామపంచాయతీకి చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ప్రెస్ మీట్  నిర్వహించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన బండారు మల్లి వైసిపి వ్యక్తి అనంతరాజుపేట గ్రామంలోని జనసేన నాయకులు వైసిపిలో 60 కుటుంబాలు చేరాయి అని చెప్పి తప్పుడు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించడం జరిగింది. అనంతరాజుపేట గ్రామానికి మొన్న మిథున్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వచ్చిన సందర్భంలో….. వైసీపీ నాయకుడు మల్లి కుటుంబ సభ్యులకు, తన బంధువులకు తనకు తానే వైసిపి కండువాలు కప్పి మరియు ఊరి సభ్యులకు ఎంపీ గారు వస్తున్నారు రండి అని చెప్పి అందరికీ వైసిపి కండువాలు కప్పాడు. ఇలా 60 కుటుంబాలు వైసీపీలో చేరాయని ఎంపీ గారి ముందు మెహర్బానీ పొందడానికి ఎమ్మెల్యే గారి మన్ననలు పొందడానికి ఇలా చేశాడు. ఊరులోని సభ్యులందరూ అసలు విషయం తర్వాత తెలుసుకొని విస్మయానికి గురయ్యారు. జనసేన అభిమానులుగా ఉన్న మాకు ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరొకసారి ఇలాంటి చేష్టలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన టిడిపి వేదిక ఘాటుగా ప్రెస్ మీట్ సందర్భంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, ముద్దపోలు రామసుబ్బయ్య, గిద్దలూరు భాను ప్రకాష్, వీర మహిళ శింగిరి శివమ్మ, సింగిరి రాజ్ కుమార్, గిద్దలూరు శివ, బండారు దుర్గ ప్రసాద్, సింగిరి మహేష్, డేగల మహేష్, మర్రి సన్నీ, మద్దిశెట్టి పెద్దన్న, సింగిరి వెంకటేష్, మర్రి వెంకటేష్ తెలుగు దేశం నాయకులు కొర్లకుంట శంకరయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way