Search
Close this search box.
Search
Close this search box.

యువత ఉజ్వల భవిష్యత్తు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనతోనే…

     అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 30వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 3వ డివిజన్ నిర్మలానంద నగర్ నందు పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏ ఒక్క నిర్ణయాన్ని స్థిరంగా తీసుకోకుండా ఎక్కడా పరిశ్రమలను అభివృద్ధి చేయకుండా యువతకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసారని అంన్నారు. జగన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ను గంజాయి వనంగా మార్చి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలంతా ఆలోచించి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర అభివృద్ధి బాధ్యత, యువత ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుంటారని.. అన్నారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో మురుగు కాలువల సమస్య,దోమల బెడద,మంచి నీటి సమస్య అధికంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way