దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిపై ఆరోపణలు రుజువు చేయాలి

పవన్ కళ్యాణ్

     రాజంపేట ( జనస్వరం ) : కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు కు దమ్ముంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని చిట్వేలు మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ సవాల్ విసిరారు. మరోసారి పవన్ కళ్యాణ్ గారి పైన పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  చిట్వేలు జనసేన పార్టీ కార్యాలయంలో మాదాసు నరసింహ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని పవన్ కళ్యాణ్ గారు అవినీతి సొమ్ము ఎంత తీసు కున్నారో దానిని ఆధారాలతో రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు చైర్మన్ గా ఉన్న కాపు కార్పొరేషన్ కి ప్రతి ఏడాది 2000 కోట్లు ఇస్తామన్నారు. ఈ నాలుగేళ్లలో ఎన్ని వేల కోట్లు రాబట్టావో లెక్క చెప్పరా..? విదేశీ విద్యా దీవెన పథకం కింద కాపు కుర్రాళ్ళకి విదేశాల్లో చదువుకోవడానికి నిధులు ఇస్తామన్నారు.. ఎంతమందికి విదేశాల్లో చదివిస్తున్నారో లెక్క చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way