2,50,000 సొంత డబ్బులతో రోడ్దు గోతులు పూడ్చిన తాడేపల్లి గూడెం జనసైనికులు

తాడేపల్లి గూడెం

            తాడేపల్లి గూడెం,  (జనస్వరం)  :   పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం పడమరవిప్పర్రు గ్రామంలో గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా గోతులు పడ్డాయి. గోతులలో పడి అనేకమంది గ్రామస్తులు గాయపడుతున్నారు. పడమరవిప్పర్రు గ్రామం సాక్ష్యాత్తు వైసీపి ఎమ్మెల్యేగారి గారి దత్తత గ్రామం కావడం గమనార్హం.  ప్రభుత్వ అధికారులకి, స్థానిక వైసీపి ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో, పడమరవిప్పర్రు గ్రామ జనసైనికులు సుమారు 2,50,000 సొంత ఖర్చుతో రోడ్డు మరమత్తులు చేయించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబి, మండల కార్యదర్శి చెన్న రాంబాబు, అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, జనసైనికులు పసల మహేష్, నాగేశ్వరరావు, హరి, బాబి, చిన్న, మానికిరెడ్డి లక్ష్మణరావు, మద్దనల సత్యం, ఉరింకల రమేష్ మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way