తిరుపతి, నవంబర్ 24 : ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి విల్సన్ తిరుపతి పట్టణంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. వి.ఉమాను కలిసి తెలుగు అకాడమీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. యూనివర్సిటీ ప్రింటింగ్ వర్క్స్ ఇస్తానని ఉమా హామీ ఇచ్చారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొ. రజని పాల్గొన్నారు. తదుపరి ఎస్.వి. యూనివర్సిటీ రిజిస్టార్ భూపతి నాయుడు, రెక్టార్ ప్రొ. అప్పారావు లతో విల్సన్ భేటీ వేశారు. రిజిస్టార్ యూనివర్సిటీ సమస్యలను ఏకరువు పెట్టారు. కోర్టులో వచ్చిన తీర్పుల వల్ల రిక్రూట్మెంట్ ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకొచ్చామని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని విల్సన్ హామీ ఇచ్చారు. అనంతరం జాతీయ సంస్కృత యూనివర్సిటీని సoదర్శించారు. యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొ. కడియం వెంకట నారాయణ, డీన్ ఎకడమిక్స్ రజనీకాంత్ శుక్ల తదితరులు ఆహ్వానం పలికి శాలువా కప్పి సన్మానించారు.

