Search
Close this search box.
Search
Close this search box.

ఫ్లెక్సీలు చింపడం అవివేకమైన చర్య, అభద్రతాభావం : కృష్ణాపురం గ్రామ జనసైనికులు

            శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్ధలం మండలం కృష్ణాపురం గ్రామంలో జనసేనపార్టీ ఫ్లెక్సీలు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చించేసారు మాది జనసేనపార్టీ సిద్దాంతాల పరంగా ఎవరినైనా ఎదుర్కొంటాము అని జనసైనికులు అన్నారు.  అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు, భయబ్రాంతులకు గురి చేసినా సమస్యల పైన పోరాటం తప్పదు అని అన్నారు.  రాష్ట్రంలో స్వచ్చమైన పరిపాలన అందించలేక ఇలాంటి దాడులకు పాల్పడటం వారి అభద్రతాభావానికి గురి చేస్తుందని అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ గొంతుకని విప్పే హక్కు ఉంది. అధికార మదంతో ఈరోజు మా గొంతులని నోక్కెయచ్చు. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలని అన్నారు. కృష్ణాపురం పంచాయతీ యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు మరియు నడుపూరు శంకర్ గారు కలిపి దేనికి భయపడే నాయకులుము కాదు అని మీ ప్రలోభాలకు లొంగే వ్యక్తులు కాదని, ఒత్తిళ్లకు భయపడరని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way