Search
Close this search box.
Search
Close this search box.

కదిరిలో టీం పిడికిలి – జనసేనపార్టీ రైతు భరోసా యాత్ర పోస్టర్ విడుదల

జనసేనపార్టీ రైతు భరోసా

          కదిరి ( జనస్వరం ) : రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3000 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలతో తన సొంత నిధుల నుంచి ఒక్కొక్క కుటుంబం కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ, ఆ రైతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా యాత్ర గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా NRI జనసేనపార్టీ విభాగం మైలవరం రాజ గారు టీమ్ పిడికిలి ఆద్వర్యంలో పోస్టర్లు ముద్రించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ రైతు భరోసా యాత్ర పోస్టర్లు శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజక వర్గం జన సేన పార్టీ ఇంచార్జీ శ్రీ భైరవ ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది. వారు మాట్లాడుతూ మన కదిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క కుటుంబంకు లక్ష రూపాయల వంతున సహాయం చేయడాన్ని కదిరి జనసేనపార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే జనసేనపార్టీ ఎప్పుడూ రైతుల తరపున వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు కుటాల లక్ష్మణ, అంజిబాబు, మహబూబ్ బాషా, ఐటీ టీమ్ సభ్యులు పొరకల రాజేంద్ర, మధుసూదన్, నవీన్,నాగరాజు, సోము శేఖర్, అల్తాఫ్, కుమార్, రాజు, లక్ష్మీనారాయణ, లక్ష్మిదేవి,  శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way