Search
Close this search box.
Search
Close this search box.

నూజివీడు జనసేన ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

   నూజివీడు ( జనస్వరం ) : దేశ యువత భవిష్యత్ కి మార్గ నిర్దేశం చేసి వారికి బాధ్యత, చదువు చెప్పే గురుదేవులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి తరుపున రాబోయే జనసేన ప్రభుత్వంలో సీపీఎస్ ను రద్దు చేయడంతో పాటు పీఆర్సి, వేతన సవరణ సకాలంలో జీతాలు అందేలా చూస్తామని అన్నారు. నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో నూజివీడు మండల పడమర దిగవల్లి ప్రధానోపాధ్యాయురాలు, ముసునూరు మండలంలోని రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులను సన్మానించి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పే నరేంద్ర, వేట త్రినాథ్, చేకూరి అనిల్, సాయి, సతీష్ , పడమర దిగవల్లి గ్రామ నాయకులు చిలీ సతీష్, సాయి జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way