Search
Close this search box.
Search
Close this search box.

బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి టీడీపీ నాయకులు చేరిక

   కొత్తపేట, (జనస్వరం) : కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలోని కొత్తపేట మండలం శివారు మోడేకురు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మీసాల వెంకటేశ్వరరావు, రుద్ర సీతారామ స్వామి (దొరబాబు), మైగాపుల నాగేశ్వరరావు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వారి ఉన్నతమైన ఆశయాలకు, పిలిస్తే పలికే, నిజాయితీపరుడైన నాయకుడు బండారు శ్రీనివాస్ నాయకత్వానికి జై కొడుతూ, ఆ గ్రామం నుంచి నిన్న రాత్రి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. అంతేకాకుండా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లోనూ, ప్రతి రోజు అధిక సంఖ్యలో ఏదో ఒక గ్రామం నుంచి భారీగా చేరికలు జరగడం, జనసేనాని ఆశయాలు ప్రజల్లో బలంగా ఉన్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అనడానికి ఇది ఒక సూచనగా పలువురు సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహాదశ బాబులు, మెడేకూరు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ కోటిపల్లి పండు, 14వ వార్డు నెంబర్ మైగాపుల నాగరాజు, కేతా ధనరాజు, పైడికొండల వెంకటేష్, చేకూరి శ్రీను, మైగాపుల భూషణం తదితరులు జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way