Search
Close this search box.
Search
Close this search box.

రైతు సమస్యలపై పోరాడి విజయం సాధించిన తణుకు జనసేన నాయకులు

తణుకు

        గత జులై 9వ తారీఖున తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు గారు అర్జనుడిపాలెంలో ధాన్యం డబ్బులు అందజేయాలని అడిగిన రైతును ధూషించినప్పుడు మొదలైన పోరాటం అలుపెరగకుండా చేయడంతో  రైతులకు డబ్బులు వారి ఎకౌంట్కు పడ్డాయని తెలియడంతో నేను చాలా సంతోష పడ్డాను. అన్నిటికన్నా ముందు నా దువ్వ గ్రామ రైతులు, మరియు వారిని ముందుండి నడిపించిన తొంట సత్య నారాయణ గారు (భారతీయ కిసాన్ సంఘ్ కారిణికారక నిర్వాహకులు) ఆనందానికి అంతే లేదు. రైతు విజయం  చూసి నిజమైన సంతృప్తిని పొందాను. నాకు కంటి నుండి నీరు ఆగలేదు. నేను హౌస్ అరెస్టు లో ఉండటం వలన వారిని కలవలేకపోయినా వారందరూ నాకు ఫోన్ చేసి నువ్వు వస్తే ఈ రోజు ఆనందంగా దీక్ష విరమిద్దామనుకుంటున్నామన్నప్పుడు నా కంటి నుంచి నీరు అనుకోకుండా వచ్చేసింది.  నిజమైన గెలుపు మనం గెలవటం కాదు భాధలో ఉన్నవాడిని గెలిపించటం అని జనసేన నాయకులు అనుకుల రమేష్ గారు అన్నారు. నాకు వారు పంచిన ప్రేమకు సదా కృతజ్ఞడను. ఈ పోరాటం లో నాతో నడిచిన ప్రతి ఒక్క జనసైనికులకు  నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way