Search
Close this search box.
Search
Close this search box.

తహశీల్దార్ కార్యాలయం ముట్టడిస్తాం : జనసేన నాయకులు సూర్యచంద్ర

       జగ్గంపేట, (జనస్వరం) : జగనన్న కాలనీలలో రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోతే తహశీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. రహదారులు నిర్మించాలని అడుగుతుంటే పోలీసు కేసులు పెడతామని బెదిరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి, బావాజిపేట, వెదురుపాక గ్రామాలలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గుమ్మళ్ళదొడ్డిలో జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” కార్యక్రమంలో సూర్యచంద్ర పాల్గొన్నారు. బాధితుల నిరసన విషయాన్ని తెలుసుకుని గుమ్మళ్ళదొడ్డి వచ్చిన గోకవరం తహశీల్దార్ శ్రీనివాస్ ముందు సూర్యచంద్ర సమస్యలను ఏకరువు పెట్టారు. ఇళ్ళ స్థలాలు ఇచ్చే ముందు లే ఔట్ లో రహదారులు, అంగన్వాడిలు, పాఠశాలలు తదితర వాటిని ప్లాన్ లో రూపొందిస్తారని నాలుగు సంవత్సరముల తర్వాత ఇప్పుడు పోలవరం కాలువకు రహదారి ఏర్పరిచామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కలెక్టరుకి లేఖ ద్వారా తెలియజేస్తానని తహశీల్దార్ చెప్పడంతో ఆందోళన విరమించారు. సాధ్యమైనంత తొందరలో సమస్యలని పరిష్కరించకపోతే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సూర్యచంద్ర పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way